సకల థార్మిక గ్రంథాల తీర్మానo-సర్వ మానవుల థర్మం ఒక్కటే!

Monday, January 26, 2015

సర్వ మానవులకు చెందిన "స్వచ్చమైన ధర్మం" గ్రంధాలలో మరుగున పడిపోయింది. అధిక శాతం స్వార్ధపరులైన ధార్మిక పండితులు సృష్టించిన "కాల్పనిక ధర్మం"ప్రజలలో వ్యాపించిపోయింది. అది వారికి అడ్డదారిలో "డబ్బును-దర్పాన్ని" సంపాదించుకునే అత్యంత సులువైన మార్గం అయ్యింది."స్వచ్చమైన ధర్మం" తెలియక ప్రజలు నైతికంగా పతనమవుతున్నారు. ఇంకా అందరి "ధర్మం" ఒక్కటే అన్న వాస్తవాస్తవం తెలియక సామాన్య ప్రజలు "మతాల"పరంగా "అనైక్యత"కు గురై పరస్పరం ఘర్షించుకుంటున్నారు. సకల ధార్మిక గ్రంధాల ప్రకారం - సర్వ మానవుల ధర్మం ఒక్కటే! ఈ విషయాన్ని ఖురాన్ తెలియజేస్తున్న వైనాన్ని గమనించగలరు.
      (ఖురాన్ కు) పూర్వపు గ్రంధాలలోని సమస్త బోధలుగల స్పష్టమైన 
       నిదర్శనం (ఖురాన్) వారి (మక్కా బహుదైవోపాసకుల) వద్దకు రాలేదా? -ఖురాన్ 20:133
పైవాక్యం ప్రకారం - ఖురాను గ్రంధంలో ఉన్న సమస్త "సిద్ధాంతాలు" ఖురాన్ కు పూర్వగ్రంధాలలో ఉన్న "సిద్దాంతాలే" అని సుస్పష్టమవుతుంది. ఇంకా ఈ క్రింది వాక్యం ద్వారా తెలిసేదేమిటో చూడగలరు.
      పూర్వికుల గ్రంధాలలో కూడా ఇది (ఖురాన్ ప్రబోధనం)ఉన్నది. -ఖురాన్ 26:196
అంటే ఈ ఖురాన్ గ్రంథం ఏ "సిద్ధాంతాలు" ప్రబోధిస్తుందో అచ్చం అవే "సిద్ధాంతాలు" ఖురాన్ కు పూర్వం వచ్చిన సమస్త ధార్మిక గ్రంధాలు కూడా కలిగి ఉన్నాయని పై వాక్యం ద్వారా సుస్పష్టమవుతుంది.
  ఇంకా, పైన పేర్కొన్న రెండు వాక్యాల ద్వారా- అటు ఖురాన్ కు పూర్వపు గ్రంధాల "సిద్దాంతాలు" ఇటు ఖురాన్ లో ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఇటు ఖురాను గ్రంధంలో ఉన్న "సిద్ధాంతాలు" అటు ఖురానుకు పూర్వపు గ్రంధాలలో కూడా ఉన్నాయని సృష్టికర్త తెలియజేస్తున్నాడు. దీనికి ఆధారంగా "భగవద్గీత-బైబిల్" గ్రంధాలకు చెందిన "పన్నెండు" మౌలిక "సిద్ధాంతాలు"తో ఖురాన్ మౌలిక "సిద్ధాంతాలు" పోలి ఉండటాన్ని ఈ పై పుస్తకంలో గమనించగలరు. కావల్సినవారు 9866865253కి సంప్రదించగలరు.

No comments :

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 

Live visitors

Recent Comments

Popular Posts

Live Visitors

Followers